Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్)లో గుడ్డు ధరను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుడ్డుకు ప్రస్తుతం ఇస్తున్న రూ.నాలుగు నుంచి రూ.ఐదుకు పెంచినట్టు వివరించారు. సోమవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 26 వేల సర్కారు బడుల్లో సుమారు 23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్న భోజనం వంట ఖర్చులను గతంలో ఏడు శాతం పెరిగిన విషయం తెలిసిందే. 2016, జులై ఒకటో తేదీనుంచి అది అమల్లోకి వచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రెండు గుడ్లతో కలిపి రూ.4.86 నుంచి రూ.6.13 (రూ.1.27)కు, ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రెండు గుడ్లలో కలిపి రూ.6.78 నుంచి రూ.8.18 (రూ.1.40)కు ప్రభుత్వం పెంచింది.