Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వనపర్తి జిల్లా, వనపర్తి మండలం, చిట్యాల తూర్పుతండాకు చెందిన వాలీబాల్ క్రీడాకారిణి శాంతకుమారిని మంత్రి నిరంజన్రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో సన్మానించారు. ఆమెకు డబుల్బెడ్రూమ్ ఇల్లు, లక్ష రూపాయల నగదును అందజేశారు. ఆమె అండర్ 18 వాలీబాల్ భారత్ జట్టుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. ఈ ఏడాది జూన్లో తాష్కెట్లో జరిగే ఆసియా మహిళల చాంపియన్షిప్లో భారతజట్టులో ప్రాతినిధ్యం వహించనున్నారు. కార్యక్రమంలో సాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.