Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదికి ఒక్కసారైన రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో మంగళవారం హైదరాబాద్లోని రాజ్భవన్ కమ్యూనిటీ హాలులో జరిగిన ప్రత్యక కార్యక్రమంలో ఆమె పాల్లొన్నారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్త దాతలను అభినందించి, వారికి సర్టిఫికెట్లను అందచేశారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ప్రతి ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఇతర పండుగలా సిబ్బంది జరుపుకోవాలని సూచించారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రోత్సహించాలని కోరారు. అనంతరం గవర్నర్ వివిధ శాఖలకు చెందిన రక్త దాతలు, రక్తదాన ప్రచారకులకు అవార్డులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నరు కార్యదర్శి కె. సురేంద్రమోహన్, రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మెన్ అజరు మిశ్రా, గవర్నర్ సంయుక్త కార్యదర్శులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.