Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 219 మందికి కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 219 మందికి కరోనా సోకింది. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 22,662 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 76 మంది డిశ్చార్జి అయ్యారు. 550 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,259 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ లో అత్యధికంగా 164 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.96 శాతంగా నమోదయింది.