Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బుధవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి. మే 16న ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ను ప్రకటించిన విషయ తెలిసిందే. అక్టోబర్ రెండు నుంచి తొమ్మిదో తేదీ వరకు దసరా సెలవులుంటాయి. నవంబర్ 21 నుంచి 26 వరకు అర్థసంవత్సర పరీక్షలను నిర్వహిస్తారు.