Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ కృష్ణప్రదీప్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా ఏడాదిపాటు కరెంట్ అఫైర్స్ తరగతులను గంటపాటు నిర్వహిస్తున్నామని 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ బి కృష్ణప్రదీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్స్ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని సబ్జెక్టు వారీగా సీనియర్ అధ్యాపకులతో 365 రోజులు ఆన్లైన్, ఆఫ్లైన్లో ఈ తరగతులను నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 040 35052121/8686233879 నెంబర్లను సంప్రదించాలని కోరారు.