Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఎడ్ రెండేండ్ల కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఎడ్సెట్ కన్వీనర్ ఎ రామకృష్ణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసే గడువును ఈనెల 22వ తేదీ వరకు పొడిగించామని తెలిపారు. డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు రాసే విద్యార్థులు సైతం దరఖాస్తు చేయొచ్చని సూచించారు. అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకుంటే కోరుకున్న ప్రాంతంలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని తెలిపారు. వాటిలో తక్కువ సంఖ్యలో అభ్యర్థులకు కేటాయించే అవకాశముందని వివరించారు. ఈ అంశాలను గమనించాలని అభ్యర్థులకు సూచించారు.