Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 వరకు అభ్యంతరాల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రాథమిక కీని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ్ర్వ్.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. సమాధానాలపై అభ్యంతరాలుంటే ఈనెల 18వ తేదీలోపు ఆన్లైన్లో సమర్పించాలని తెలిపారు.
ఈనెల 12న నిర్వహించిన టెట్ పేపర్-1కు 3,51,468 మంది దరఖాస్తు చేస్తే 3,18,506 (90.62 శాతం), పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేయగా, 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈనెల 27న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.