Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 205 మందికి కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 205 మందికి కరోనా సోకింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 21,070 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 63 మంది డిశ్చార్జి అయ్యారు. 533 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,401యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 19 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా 132 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.97 శాతంగా నమోదయింది.