Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వైద్య ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను మంత్రి చులకనగా చేసిన మాట్లాడటం సరైందికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యాసంస్థకు ఉపకులపతి లేకుండా సజావుగా ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సందర్శించి సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలంటూ విద్యార్థుల డిమాండ్కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.