Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి
- వచ్చే 3 రోజులకుగానూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గురువారం రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. గురువారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చూసుకుంటే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్లో అత్యధికంగా 7.08 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.మొత్తంగా 200పైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదుకాగా...77 ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మిగతాచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి ఉంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. రాజన్నసిరిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి,ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్, వరంగల్ రూరల్,అర్బన్,జనగామ,సిద్దిపేట,మహబూబ్నగర్, నాగర్క ర్నూల్,వనపర్తి,నారాయణపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవ కాశం ఉంది.తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టం నుంచి 0.9కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి నెలకొని ఉంది.