Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనిమిదేండ్లు పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని గోల్నాక డివిజన్లో కరపత్రాల పంపిణీ జరిగింది. న్యూ గంగానగర్, 170 పోలింగ్ బూత్ ఇంఛార్జి సింగీతం రాజేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జోగులంబ గద్వాల్ జిల్లా బీజేపీ ఇంచార్జి బి వెంకట్ రెడ్డి, బీజేపీ గోల్నాక డివిజన్ కన్వీనర్ మూల రవీందర్ గౌడ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆర్విఎల్ రమేష్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు బి ఈశ్వర్ రావు, మోర్చా నగర కార్యదర్శి కె రామ్ చందర్, కల్ప కేశవ్, శేఖర్, కిషోర్, సింగీతం అజరు, ప్రభాకర్ చారి, బూత్ కార్యకర్తలు పాల్గొన్నారు.