Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలకరించిన తొలకరి
- చేలల్లో రైతుల సందడి
నవతెలంగాణ-పాలకుర్తి
రైతులను మృగశిర మురిపించడం, తొలకరి పలకరించడంతో రైతన్నల్లో ఆనందం వెల్లివిరిసింది. రోహిణి కార్తీ నుంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలను మృగశిర కార్తి మురిపించి పలకరించింది. దాంతో రైతులు, కూలీలు చేలల్లో సందడి చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలతో వర్షాలు కురవడంతో రైతులు చేలల్లో పత్తి విత్తనాలు విత్తుతున్నారు. గురువారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఎక్కడ చూసినా చేలల్లో రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండటం కనిపించింది. అదును కోసం ఎదురు చూసిన రైతన్నలు వర్షాలు కురవడంతో ఊపిరిపీల్చుకున్నారు.