Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనలో సంఘ విద్రోహ శక్తులు చేరాయనీ, కారకులైన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజ్భవన్ ముట్టడి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలు చూస్తుంటే పక్కా కుట్ర పన్నే చేస్తున్నట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రజల ఆస్తులనీ, వాటిని రక్షించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపారు.