Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం పథకం ప్రకారమే : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సైన్యంలో చేరాలనుకునేవారికి అగ్నిపథ్ పథకం గొప్ప వరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కుమార్ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంస కాండను తీవ్ర ఖండిస్తున్నామనీ, ఇది ఆవేశపూరిత చర్యకాదు..పక్కా పథకం ప్రకారం జరిగిన ఘటన అని పేర్కొన్నారు.ఆర్మీ అభ్యర్థులు ప్రశాంతంగా నిరసన తెలుపుతుంటే వారి ముసుగులో సంఘవిద్రోహ శక్తులు చేరి విధ్వంసం సృష్టించాయని ఆరోపించారు.దీన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.