Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్వీనర్ వి సత్యనారాయణ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు పీఈసెట్ కన్వీనర్ వి సత్యనారాయణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా ఈనెల 30 వరకు గడువును పొడిగించామని తెలిపారు. ఆలస్య రుసుం రూ.500తో జులై 12 వరకు, రూ.రెండు వేలతో 20 వరకు, రూ.ఐదు వేలతో 27వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు.