Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకుని చికిత్స పొందుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డిని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, చుక్క రాములు, డిజి నరసింహారావు శనివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చాడ తొందరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. వారితోపాటు ఆయన్ను సీపీఐ రాష్ట్ర ఇన్ఛార్జి కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర నాయకులు రత్నాకర్రావు, బిఎస్ఆర్ మోహన్రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనీ, ఒకటి, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వివరించారు.