Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల వేధింపులు భరించలేక బలవన్మరణం !
నవతెలంగాణ-భిక్కనూర్
అధికారుల వేధింపులు భరించలేక ఆర్టీసీ డ్రైవర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డిలో శనివారం జరిగింది. స్థానికులు, బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్(42) కామారెడ్డి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటివద్దే ఉన్నాడు. విధులకు హాజరు కావాలని ఆర్టీసీ అధికారులు తరచూ ఫోన్ చేయడంతోపాటు.. రాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని వేధించారు. సిక్ లీవ్ ఇవ్వాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్వామిగౌడ్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ లెటర్ రాసి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. అతనికి భార్య శిరీష, ఇద్దరు కొడుకులున్నారు.