Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాసర ట్రిపుల్ ఐటీలో తమ సమస్యలు పరిష్కరించాలని గత వారం రోజులుగా విద్యార్థులు నిరవధికంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని పీడీయస్యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం పరుశురాం, ఇ విజరుకుమార్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. శాశ్వత ప్రాతిపదికన వీసీ నియామకం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించి, పౌష్టికాహారాన్ని అందించాలని కోరారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని బలపరుస్తున్నామని తెలిపారు. వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యఉద్యమాలకు శ్రీకారం చుట్టక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.