Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మనం ఆరోగ్యంగా ఉండాలంటే యోగాని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి సూచించారు. సోమవారం ఆయన సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరేడ్ గ్రౌండ్లో మంగళవారం ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభమయ్యే యోగా దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. మైసూర్లో ప్రధాని మోడీ పాల్గొంటారని చెప్పారు. 200 దేశాల్లో యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. మంగళవారం ఉదయం నుంచి 24 గంటల పాటు దేశవ్యాపంగా యోగా దినోత్సవ వేడుకలు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.