Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్కు రాష్ట్ర పోలీసు శాఖ భద్రతను పెంచింది. 1+5 (కానిస్టేబుళ్ల)తో రోప్ పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం అదనంగా ఎస్కార్ట్ వాహనాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పరిధిలో మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు భద్రత పెంచాలని ఇంటలిజెన్స్ సూచించినట్టు తెలిసింది. కరీంనగర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బండి సంజయ్ కు ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది.