Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతిఒక్కరూ యోగను తమ నిత్యజీవితంలో భాగంగా అలవాటు చేసుకోవా లని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సూచిం చారు. యోగ కులమతాల కతీతంగా అందరికీ ఆచరణ యోగ్యమైనదన్నారు. మంగళవారం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగా అత్యంత ప్రాచీనమైనదన్నారు. ప్రపంచదేశాల్లో శాంతి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరిగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మాజీమంత్రి ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్రావు, ఇంద్రసేనారెడ్డి, షట్లర్ పీవీ సింధు, సినీ నటుడు అడివి శేషు, తదితరులు పాల్గొన్నారు.