Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్లైన్లో ఎంసెట్, నీట్, జేఈఈ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు ఇంటర్ విద్యాశాఖ ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఈనెల ఆరున ఈ కోచింగ్ను ప్రారంభించారని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో చదివే ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్థులు https//www.tscie.rankr.io పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
హాజరు మినహాయింపు గడువు 29
హాజరు మినహాయింపు గడువు ఆలస్య రుసుం రూ.200తో ఈనెల 29 వరకు ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టుల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.