Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 494 మందికి కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 494 మందికి కరోనా సోకింది. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 28,865 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 126 మంది డిశ్చార్జి అయ్యారు. 517 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,048 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 37 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరా బాద్లో అత్యధికంగా 315 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 1.71 శాతంగా నమోదయింది.