Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు 2022-23 విద్యాసంవత్సరంలో పూర్తిస్థాయి సిలబస్ను బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో 2020-21, 2021-22 రెండు విద్యాసంవత్సరాల్లోనూ 70 శాతం సిలబస్తోనే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంటే 30 శాతం సిలబస్ను తొలగించింది. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి వందశాతం సిలబస్ను విద్యార్థులకు బోధించాలని నిర్ణయించామని జలీల్ స్పష్టం చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ను త్వరలోనే www.tsbie.cgg.gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని వివరించారు. కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలో పాత పద్ధతిలోనే పూర్తిస్థాయి సిలబస్తో ప్రశ్నాపత్రాలను రూపొందిస్తారు.