Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యే అవకాశమున్నది. ఈ దిశగా ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫలితాల విడుదలకు హాజరుకావాలంటూ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి ఇంటర్ బోర్డు అధికారులు సమాచారం అందించినట్టు తెలిసింది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఆరోజు వీలుకాకపోతే సోమవారం విడుదల చేసే అవకాశమున్నట్టు తెలిసింది. గతనెల ఆరు నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.