Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 493 మందికి కరోనా సోకింది. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 29,084 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 219 మంది డిశ్చార్జి అయ్యారు. 410 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,322 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 37 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా 366 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 1.69 శాతంగా నమోదయింది.