Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వర్ డౌన్, టెక్నికల్ సమస్య
- విద్యారుa్థలు, తల్లిదండ్రుల ఆందోళన
- వాయిదా వేసినట్టు అధికారుల ప్రకటన
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ఇంటర్నెట్ సర్వర్ డౌన్, టెక్నికల్ సమస్యతో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటలోని పోస్నేట్ భవన్లో గల అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావల్సిన ఎగ్జామ్ 10:30 గంటలకు ప్రారంభం అయింది. దీంతో మధ్యహ్నం 3 గంటలకు ప్రారంభం కావల్సిన పరీక్షకు కూడా విద్యార్థులను అనుమతించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. శుక్రవారం ఉదయం జరిగిన పరీక్షలో 26 ప్రశ్నలు కనిపించలేదని విద్యార్థులు ఆరోపించారు. దీనికి కళాశాల్లో సరైన సదుపాయాలు లేకపోవడమే కారణంగా తల్లిదండ్రులు తెలిపారు. సరైన పద్ధతుల్లో పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ పి.పద్మ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ఉన్నత అధికారులతో మాట్లాడారు. దీంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు వారు తెలిపారు. నగరంలో పలు కళాశాలల్లో ఇలానే టెక్నికల్ సమస్యలు ఉత్పన్నమై పరీక్షలు జరగలేదన్నారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి ఈనెల 29 తర్వాత తేదీని ప్రకటిస్తామన్నారు.