Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మెరుగైన వైద్యం కోసం నిమ్స్ అస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ పరామర్శించారు. శనివారంనాడాయన నిమ్స్లో వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై డాక్టర్లతో మాట్లాడారు. మరింత మెరుగైన వైద్యం అందిం చేలా కృషి చేయాలని కోరారు. అలాగే తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో లభిస్తున్న సేవలు, రోజువారీ ఔట్పేషెంట్ల సంఖ్య, ఇస్తున్న మందులు తదితర వివరాలను తార్నాక ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిరణ్ను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీకి చెందిన 20 మంది పేషెంట్లకు నిమ్స్లో వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ సీఐ కుమార్తె అయిన పూర్ణిమ అనే పాపకు రెండ్రోజుల్లో జనరల్ సర్జరీ అవుతున్న సంగతి తెలుసుకొని, ఆ పాపను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా నిమ్స్ వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.