Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బోగత జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్ఘడ్లో కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతంలో జలకళ సంతరించుకుంది. సుమారు 50 అడుగులపై నుంచి నీరు జాలువారుతున్న సవ్వడులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.