Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శిగా పోటు రంగారావు ఎన్నికయ్యారు. సోమవారం ప్రజాపంథా రాష్ట్ర కమిటి సమావేశంలో ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత సూర్యాపేట జిల్లా రంగాపురం గ్రామంలో ఆయన జన్మించారు. కోదాడలో ఇంటర్ విద్యను అభ్యసించారు. ఖమ్మంలో డిగ్రీ చదివారు. నెల్లూరు లా కాలేజీలో న్యాయ విద్యను మధ్యలో వదిలేశారు. ఆ తర్వాత 1977 నుంచి విద్యార్థి రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించారు. పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1991 నుంచి 96 వరకు ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించారు. 2006 నుంచి 2016 వరకు ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శిగా కొనసాగారు. 2016 మే నుంచి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొనసాగారు.