Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడుదల చేయనున్న మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. గతనెల ఆరు నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,64,626 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,42,767 మంది కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresuls.ts.nic.in వెబ్సైట్లను సంప్రదించాలి.