Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ హబ్ 2.0 ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
- ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్...ప్రజలకు అంకితం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''ఆలోచనతో రండి - ఆవిష్కరణలతో వెళ్లండి'' అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, '' టీ హబ్ -2.0 ''ను, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్తో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీ హబ్ ప్రాంగణమంతా సీఎం కేసీఆర్ కలియ తిరిగారు. వివిధ అంతస్తుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాలను వాటి వివరాలు తెలుసుకున్నారు. టిహబ్పై అంతస్తులో కారిడార్లో కలియ తిరిగి నాలెడ్జ్ సిటీ పరిసర ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. దేశ విదేశాల్లోని ఐటి కేంద్రాలను తలదన్నేలా నిర్మితమైన భవనాలను సీఎం తిలకించారు. ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పలు అంకుర సంస్థల ప్రతినిధులు, పలు రకాల కంపెనీల ప్రతినిధులు టి హబ్ కేంద్రంగా చర్చించుకోవడానికి ఏర్పాటు చేసిన.. మీటింగ్ హాల్స్, వర్క్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. టీ హబ్ ఇన్నొవేషన్ సెంటర్కు సంబంధించిన విషయాలన్నింటినీ అధికారులను మంత్రి కేటీఆర్ ను సీఎం అడిగి తెలుసుకున్నారు. టి హబ్ను అత్యంత విశాలమైన ఐదు రోడ్ల కూడలిలో అత్యాధునిక డిజైన్తో సాండ్ విచ్ ఆకారంలో ప్రత్యేకంగా టీ హబ్ను నిర్మించామని వారు తెలిపారు. టీ హబ్ నుంచి ఐదు మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించామని ముఖ్యమంత్రికి చెప్పారు. మొదటి అంతస్తులో మొత్తం వెంచర్ కాపిటలిస్టుల కోసం కేటాయించామని మంత్రి కేటీఆర్ సీఎంకు తెలిపారు. టిహబ్ భవనం చుట్టూ విస్తరించి వున్న ప్రముఖ కంపెనీలను సీఎం కలియతిరుగుతూ పరిశీలించారు. గేమింగ్, యానిమేషన్, సినిమాల్లో త్రీడీ ఎఫెక్టుల వంటి రంగాల్లో కృషి చేస్తున్న సంస్థలన్నీ హైద్రాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తమ సేవలందిస్తున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు.
ఈ సందర్భంగా ఐటీ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమించిన మంత్రి కేటీఆర్తో పాటు, అధికారుల బందాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు శాఖలో సాంకేతికతను మరింతగా మెరుగుపరుచుకునే దిశగా, సైబర్ క్రైంను అరికట్టేందుకు కమాండ్ కంట్రోల్ రూంను మరింతగా అభివృద్ది చేసేందుకు టిహబ్ తో సమన్వయం చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. రోజు రోజుకూ పెరుగుతున్న సాంకే తికత, ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా., దైనందిన జీవితంలో సామాన్య ప్రజల జీవన విధానాలు గుణాత్మకంగా పురోగమించేందుకు అంకుర సంస్థలు కృషి చేసేందుకు టిహబ్ దృష్టి సారించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వున్న యువతలోని ప్రతిభను కూడా వినియోగించుకునే దిశగా భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్లో ఐటి రంగంలో మరింత పురోగతి ఉంటుందనీ, దానికనుగుణంగా మౌలిక వసతుల ను పెంచేందుకు అధికారులు దష్టి సారించాలని సీఎం అ న్నారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీ ఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధు సూదనాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మర్రి జనార్థన్ రెడ్డి, టిఎస్ ఐఐసి చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, టీఎస్టీఎస్ చైర్మెన్ పాటిమీది జగన్ మోహన్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.