Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే బాధతో విద్యార్థులెవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ విద్యార్థులు ఎక్కువ మొత్తంలో ఫెయిల్ అవ్వడానికి కారణం తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఏండ్ల తరబడి లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులకు న్యాయమైన విద్య అందట్లేదని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో మార్కులే ప్రధానమనే భావనను పిల్లల్లో తల్లిదండ్రులు కల్పించొద్దని కోరారు. సీఎం కేసీఆర్ రాజకీయాలను పక్కనబెట్టి విద్యాశాఖ బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.