Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
జీఎస్టీ 47వ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు చండీగఢ్ వచ్చిన తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తన్నీరు హరీశ్రావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కురుక్షేత్ర ప్రతిమలను బహూకరించారు. వీరి గౌరవార్థం బుధవారం నాడాయన అక్కడి రాజ్భవన్లో మర్యాదపూర్వక విందుకు ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఇరువురు ఆర్థిక మంత్రులను శాలువాలు కప్పి సన్మానించి, కురుక్షేత్ర ప్రతిమలను బహూకరించినట్టు దత్తాత్రేయ వ్యక్తిగత కార్యదర్శి కైలాష్ నాగేష్ ఓ ప్రకటనలో తెలిపారు.