Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెయిల్ కావడంతో నిప్పంటించుకొని...
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని నిప్పంటిం చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. నగరంలోని హను మాన్నగర్కు చెందిన దీక్షిత్ ఎస్ఆర్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. మంగళవారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరంలో దీక్షిత్ ఎంపీసీలో ఐదు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. దాంతో బుదవారం ఉదయం బయటకు వెళ్లిన విద్యార్థి దీక్షిత్ గాయత్రి నగర్ శివారు ప్రాంతంలో సుమారు మధ్యాహ్నం సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4 టౌన్ ఎస్ఐ సందీప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీక్షిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విద్యార్థులు మనస్తాపానికి లోను కావొద్దని, తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని పోలీసులు సూచించారు.