Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహౌత్సవాలను జులై 5వ తేదీ నిర్వహిస్తున్నామనీ, ఈ వేడుకకు ప్రభుత్వం తరఫున హాజరుకావాలని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన నిర్వహకులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం గచ్చిబౌలిలోని మంత్రి నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. దేవస్థాన ట్రస్టు బోర్డుచైర్మెన్ చైర్మన్ సాయిబాబా, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నపూర్ణ, ఆలయ అర్చకులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. జూలై 4న ఎదుర్కోళ్లు, 5న అమ్మవారి కళ్యాణం, 6న రథోత్సవం జరుగుతాయని ఈ సందర్భంగా వారు తెలిపారు.