Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి ఫలితాల్లో మోడల్ స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని మోడల్ స్కూళ్ల అదనపు డైరెక్టర్ ఉషారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు 18,720 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 18,205 (97.25 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. వందశాతం ఉత్తీర్ణత పొందిన స్కూళ్లు 72 ఉన్నాయని పేర్కొన్నారు. పదికి పది జీపీఏ పొందిన వారు 288 మంది ఉన్నారని తెలిపారు. ఏ1 గ్రేడ్ 4,841 మంది, ఏ2 గ్రేడ్ 6,889 మంది, బీ1 గ్రేడ్ 4,166 మంది, బీ2 గ్రేడ్ 1,722 మంది సాధించారని వివరించారు.