Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్ విజయభేరి మోగించింది. 1,169 మంది పదికి పది జీపీఏ సాధించి ఉత్తమ ప్రతిభను కనబరిచారని శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 9.8 జీపీఏ ఆపైన సాధించిన విద్యార్థులు 2,537 మంది, 9.5 ఆపైన జీపీఏ సాధించిన వారు 4,848 మంది ఉన్నారని వివరించారు. వందశాతం ఉత్తీర్ణత పొందిన బ్రాంచ్లు 39 ఉన్నాయని పేర్కొన్నారు. 8,828 మంది మ్యాథ్స్లో, 7,925 మంది సైన్స్లో, 8,942 మంది సోషల్ స్టడీస్లో ఏ గ్రేడ్ సాధించారని తెలిపారు. అన్ని సబ్జెక్టులూ కలిపి పది జీపీఏ 29,958 మంది అని వివరించారు. ఏ గ్రేడ్ పొందిన విద్యార్థులు 48,859 మంది ఉన్నారని పేర్కొన్నారు. మార్కులైనా, గ్రేడ్ పాయింట్ యావరేజ్ అయినా పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య నెంబర్వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. ప్రతి విద్యార్థిపైనా వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియెంటెడ్ బోధన, సీ-ఐపీఎల్, ఎంపీఎల్, ఐకాన్, సీ బ్యాచ్, సివిల్స్, మెడికాన్, టెక్నో వంటి పటిష్టమైన అకడమిక్ ప్రోగ్రామ్ల వల్ల విద్యార్థులను అన్ని రంగాల్లో సృజనాత్మక కల్పిస్తున్నామని వివరించారు.