Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదిలో తప్పడమే కారణం..
నవతెలంగాణ - పెద్దమందడి
పదో తరగతి పరీక్షల్లో తప్పినందుకు మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం, మణిగిళ్ల గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డె ఉషన్న- పార్వతమ్మ దంపతుల కుమార్తె సంధ్య (16) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గణితంలో రెండు మార్కులు తక్కువ రావడంతో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన విద్యార్థిని మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. పనుల నిమిత్తం బయటకెళ్లి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు ఉరి కొయ్యపై వేలాడుతున్న కుమార్తెను చూసి తల్లడిల్లిపోయారు. గుండెలవిసేలా రోదించారు.