Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, లక్ష్మిపురం ఎంపీసీటీ కిలారు తిరపతయ్య శనివారం అనారోగ్యంతో హైదరాబాద్లో మరణించడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు సంతాపం ప్రకటించారు. ఆయన సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా బోనకల్ మండల కార్యదర్శివర్గ సభ్యుడుగా, రైతు సంఘం జిల్లా కమిటి సభ్యుడుగా, లక్ష్మిపురం ఎంపీటీసీగా, నీటి సంఘం చైర్మెన్గా పనిచేశారని తెలిపారు. మండలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉంటూ, ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం పాటుపడ్డారని పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు. తుదిశ్వాస వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం నిలిచిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. ఆయన చూపిన దారిలో నడవాలని పార్టీ శ్రేణులను కోరారు.