Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డీవైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బోయిల్ల నవీన్పై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడి చేయడాన్ని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి అనగంటి వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామంలో పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఒంటరిగా వెళ్తున్న నవీన్ను లక్ష్యంగా చేసుకుని కర్రలతో, రాళ్లతో దాడి చేశారని విమర్శించారు. దీంతో అతని తల పగిలిందనీ, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అతను ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ, తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.