Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు సోమవారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు నాలుగెకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి 3,946 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. 78,93,413 ఎకరాలకు సంబంధించిన నిధులు విడుదల చేశారు. ఐదెకరాల పైబడి ఉన్నరైతులకు మంగళవారం నుంచి రైతు బంధు నిధులు వారి ఖాతాల్లో జమ అవుతున్నట్టు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఆర్థిక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అర్హులైన ప్రతీ రైతుకు సకాలంలో నిధులు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.