Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల విడుదలకు మంత్రి హరీశ్ రావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగుల, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు సోమవారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో సమీక్ష జరిపారు. ఆరు శాఖలకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన రూ.362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో పాటు మార్చి 31 వ తేదీలోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, ఈబీసీ, మైనార్టీ శాఖల నుంచి బిల్లులు అందలేదన్న కారణంతో ట్రెజరరీ అధికారులు తిప్పిపంపడంపై మంత్రి దృష్టికి రావడంతో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన బిల్లులను సంబంధింత శాఖలు తిరిగి ట్రెజరరీకి సమర్పించాలనీ, ఆ బిల్లులను వెంటనే ట్రెజరరీ అధికారులు క్లియర్ చేయాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపకారవేతనాల బీఆర్వోలను విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన రామకష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.