Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 552 మందికి కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 552 మందికి కరోనా సోకింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 25,913 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 496 మంది డిశ్చార్జి అయ్యారు. 666 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,753 యాక్టివ్ కేసులు న్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 71 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా 316 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 2.13 శాతంగా నమోదయింది.