Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఇంకా మిగిలివున్న భూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. సదస్సుల నిర్వహణకు సంబంధించి అవగాహన సదస్సును ఈ నెల 11 వ తేదీన ప్రగతి భవన్లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరుగనున్నది.