Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు కార్యదర్శికి టీఎస్జీసీసీఎల్ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం (టీఎస్జీసీసీఎల్ఏ-475) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలై సుమారు ఐదు రోజులు గడిచాయని తెలిపారు. అయినప్పటికీ ఇంటర్ బోర్డు ఇంతవరకు ప్రథమ సంవత్సర విద్యార్థులు చేరటానికి ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు.