Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యదర్శి మల్లయ్య బట్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలను ఎjజ్ూbషషతీవఱర.్వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో చూసుకోవాలనీ, అర్హులైన వారికి మెరిట్ ఆధారంగా సీట్లు ఇస్తామని తెలిపారు. త్వరలో ఆ జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. సీట్లు వచ్చినవారికి మెసేజ్ పంపిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సోసైటీ పరిధిలో ఉన్న గురుకుల విద్యా సంస్థల్లో 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం గతనెల జూన్ 19న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ద్వారా ఆరో తరగతిలో 1,223 సీట్లు, ఏడో తరగతిలో 893 సీట్లు, ఎనిమిదో తరగతిలో 636సీట్లు భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.