Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ పాత్రికేయులు కష్ణారావుకు పురస్కారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏ సమాజమైనా ఎదగాలన్నా... మారాలన్నా... ఏ సమాజమైనా తనకు తాను నిలబడాలన్నా సాహిత్యం, సంస్కృతి అవసరమనీ, ఇవి లేకుండా మానవ మనుగడ లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆచార్య ఆర్.లింబాద్రి చెప్పారు. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం గురువారం వర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పద్యకవితా ప్రక్రియలో డా.ఎం.పురుషోత్తమాచార్య 'రహస్యభూతము', వచన కవితా ప్రక్రియలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారావు (కృష్ణుడు) ''ఆకాశం కోల్పోయిన పక్షి'', బాలసాహిత్యంలో ఎం.కష్ణకుమారి 'ఈ అడమి మాది' కథానికా ప్రక్రియలో డా.సిద్దెంకి యాదగిరి 'తప్ష'కు రూ.20,116ల నగదు పారితోషికంతో పాటు సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లింబాద్రి పురస్కారగ్రహీతలను సత్కరించి అభినందించారు. విశిష్ట అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ యోగ్యత గల సాహితీవేత్తలను శోధించి వారికి సముచిత రీతిలో సత్కరించడంతో సాహిత్యలోకం ఎంతో హర్షిస్తుందని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ వీసీ ఆచార్య కిషన్రావు మాట్లాడుతూ తెలుగు సాహిత్య సేవకు అంకితమైన నిరాడంబర రచయితలకు 2019 సాహితీ పురస్కారాలను అందించడాన్ని విశ్వవిద్యాలయం గర్వపడుతుందని అన్నారు. ఆంధ్రజ్యోతి అసోసియేటెడ్ ఎడిటర్ ఎ.కృష్ణారావు మాట్లాడుతూ భారతీయ విలువల్లో ప్రశ్నకు, జిజ్ఞాసకూ ప్రాధాన్యం ఉన్నదన్నారు. కానీ నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఒక జర్నలిస్టు కవి అయితే వార్తల్లో వ్యక్తం చేయలేని భావాలను కవిత్వంగా రాసుకుంటారని అన్నారు. సమాజంలోని వ్యత్యాసాన్ని, అసమానతల్ని చూడలేని వాడు కవి కాడని అన్నారు. మన సాహిత్యం ద్వారా సమాజానికి ఉపయోగపడాలని అన్నారు. కవిత్వమంటే చెట్ల ఆకులు రాల్చిన కన్నీళ్లు ఒక అమరుడి మీద ఎలా పాడిందో గమనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా జేఎన్టీయూ వీసీ డాక్టర్ కట్టా నర్సింహారెడ్డి, కాకతీయ వర్సిటీ పూర్వ వీసీ సాయన్న, తెలుగు వర్సిటీ రిజిస్టార్ర్ ఆచార్య భట్టు రమేష్, రింగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.