Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్రంలోని అసమర్థ పాలన వల్లే నిత్యవసరాల సహా అన్నింటి ధరలు ఆకాశానికి పెరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు విమర్శించారు. వంట గ్యాస్ ధరను మరింత పెంచడాన్ని ఆయన తప్పుపట్టారు. గృహిళులపై కేంద్ర సర్కారు నేరుగా వేసిన ఆర్థిక భారమన్నారు. మోనార్క్ మోడీ రాజ్యంలో కుటుంబ బడ్జెట్ తలకిందులు అవుతున్నదని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనలో దేశం ఉన్నదని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనా విధానాలపై నిరంతర పోరు కొనసాగుతుందని చెప్పారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసిన టీఆర్ఎస్ శ్రేణుల్ని ఆయన అభినందించారు.
వంద ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి :ఎమ్మెల్యే జీవన్రెడ్డి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఏ వర్గానికి ఏం మేలు చేశారో చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను కేంద్రానికి వంద ప్రశ్నలు వేస్తున్నానని చెప్పారు. వాటికి ప్రధాని మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సహా ఎవరైనా సమాధానాలు చెప్పొచ్చన్నారు. గురువారంనాడిక్కడి టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.